ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దుల్లో పరీక్షలు చేయండి’

‘ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దుల్లో పరీక్షలు చేయండి’


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశం


పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.


ఎన్‌వోసీ తీసుకుని సమస్య పరిష్కరించాలని భాజపా నేత గోపాలకృష్ణ పిటిషన్‌ వేశారు.


 ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 


ఆరోగ్యం బాగా లేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.


 క్వారంటైన్‌కు వెళ్లే అవసరం లేదంటే వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది.


వారిని హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించింది.