పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి

గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఎస్‌ఐ సహా ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టుబడ్డారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి సోదరుడి కనుసన్నలలో పేకాట శిబిరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధి వత్తిడితో దాడి విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం.