ఒరిస్సా నుంచి వచ్చిన వలస భవన నిర్మాణ కార్మికులకు వై ఏస్ రెడ్డి ట్రస్ట్ సహాయం.


పోచారం మున్సిపల్ పరిధిలోని యన్నంపేటలో ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి భవన నిర్మాణంలో కూలిపని చేసుకుంటూ జీవనం గడుపుతున్న వారికి కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అవడం వలన వారికి ఉపాధి లేక వారి చేతిలో డబ్బులు అయిపోయి ఇబ్బందిపడుతున్న వారి కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో ఆశ వర్కర్ సూపర్వైజర్ విమల గారు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి విషయం తెలియజేయడంతో వెంటనే స్పందించి వైయస్ రెడ్డి ట్రస్టు ద్వారా వారికి బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను వైయస్ రెడ్డి ట్రస్టు మండల సభ్యులు రమేష్ భానుచందర్ చేతుల మీదగా వారికి అందజేశారు.