చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం

చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేపడతా.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.



గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనకొచ్చిన కోటి రూపాయల జీతాన్ని ప్రజా సంక్షేమంకోసం ఖర్చుపెట్టానని ఈ దఫా కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తానని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్లలో తనకొచ్చే కోటి రూపాయల జీతంతో చరిత్రలో నిలిచిపోయేలా ఓ కార్యక్రమాన్ని చేపడతానని.. అందరినీ సంప్రదించి దానిపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారులకు పిలుపు ఇచ్చిన మేరకు తాను కూడా వారానికోరోజు ప్రజల మధ్యే గడుపుతానని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనో, హాస్టల్ లోనో.. రాత్రిపూట పల్లెనిద్ర చేసి అక్కడి సమస్యలు తెలుసుకుంటానన్నారు. తనను కలవడానికి వచ్చేవారు ఎవరైనా ప్రేమతో రావాలని, బొకేలతో వద్దని సూచించారు. పూలమాలలు, శాలువాలకు పెట్టే ఖర్చుని పేద విద్యార్థులకోసం, అనాథ పిల్లలకోసం, వృద్ధులకోసం ఖర్చు చేయాలని కోరారు.