ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి కి దెబ్బ

ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి తొలి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.


చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే మొదటి దెబ్బ పడింది.


దీనితో పూర్తి డిఫెన్స్ లో వైకాపా వెళ్ళింది.


వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు ప్రజావేదిక చుట్టూనే తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి పక్కనే ఉన్న ఈ కట్టడం..అక్రమ కట్టడమని..దాన్ని కూలగొడతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు వెంటనే కూలగొట్టారు. నదీ గర్భంలో ప్రజావేదిక కట్టారని అధికారంలో ఉన్నవారే తప్పులు చేస్తే ఎలా అని ? అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేస్తామని ఆయన ప్రకటించి అపనిని అధికారులతో చేయించారు. కాగా ఈ వ్యవహారంలో జగన్‌ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. కోళ్ల ఫారమ్‌ వంటి నిర్మాణానికి   కోట్లు ఖర్చు చేశారని, రేకులతో వేసిన షెడ్‌కు అంత సొమ్ము కేటాయించుకుని దిగమింగేశారని ఆరోపణలు ఉన్నాయి. 



సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు..పలువురు మంత్రులు ఆరోపించారు. చిన్న షెడ్‌లోనే ఇంత అవినీతి జరిగితే..రాజధాని నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చునని..వారు తీవ్రంగా విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఇది అక్రమ కట్టడమని, దీని కోసం రూ.9కోట్లు వెచ్చించారని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైకాపా నాయకులు, మంత్రులు ప్రజావేదిక ను తొమ్మిది కోట్లతో నిర్మించారని చెబుతుండగా దానికి కేవలం రూ.90లక్షలు మాత్రమే అయిందని గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెబుతోంది. ప్రజావేదిక నిర్మాణం కోసం ఆర్‌ అండ్‌ బి శాఖ 4.4.2017న జీఓ నెం.ఆర్‌.టి.104ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.90లక్షలు, పార్కింగ్‌ కోసం రూ.47లక్షలు, మట్టి చదును కోసం రూ.32లక్షలు, ప్రహారిగోడ కోసం రూ.14లక్షలు, సెక్యూరిటీ పోస్టు కోసం రూ.8లక్షలను విడుదల చేసింది. ప్రజావేదిక నిర్మాణం, దాని చుట్టుపక్కల పార్కింగ్‌, సెక్యూరిటీపోస్టు, ఇతర మౌళికసదుపాయాల కల్పన కోసం అప్పటి ప్రభుత్వం వెచ్చించింది రూ.1.91లక్షలు. కాగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రూ.9కోట్లు ఖర్చు చేశారని, నిధులు దుబారా చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ జిఓ కాపీ టిడిపి రిలీజ్ చేయటంతో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైకాపా చేస్తున్న అబద్దపు ప్రచారం బయటకి వచ్చింది. దీనితో వైకాపా డిఫెన్స్ లో పడింది.90 లక్షల ఖర్చు అయిన కట్టడానికి కోటి రూపాయిలు పెట్టి తొలగించారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా వైకాపాకి మొదటి మాస్టర్ స్ట్రోక్ పడిందనే భావించాలి.