కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్

కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్


అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిపై సీఎం కేసీఆర్ స్పందించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణపై సీరియస్ కేసీఆర్ అయ్యారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు భూమిని చదును చేసేందుకు వెళ్లగా.. కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎఫ్‌ఆర్వో చోలే అనిత, సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోనేరు కృష్ణ సహా 16 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.