జూలై 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం
మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధిత ఫైల్ అసెంబ్లీ సచివాలయానికి చేరింది. తర్వాత ఫైల్ గవర్నర్ నరసింహన్కు చేరనుంది. గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇకపోతే జూలై 11న దశమి. ఇది మంచి రోజు కావడంతో బడ్జెట్ సమావేశాలు అదే రోజున ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ను గత ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ఆవిష్కరించబోతోంది.వైఎస్ జగన్ తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొట్టమొదటి సారిగా బడ్జెట్ రూ.2.17 లక్షల కోట్లుగా ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి బడ్జెట్లో నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యమిచ్చే( రైతు భరోసా) అవకాశముంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 12న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన మంత్రులతో ఈయన సమావేశమౌతున్నారు. ఇకపోతే బడ్జెట్లో రైతు భరోసా, అన్నదాతలకు సున్నా వడ్డీకే రుణాలు, పంట బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వంటి వాటికి కేటాయింపులు ఉండే అవకాశముంది.