సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ
సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ

 

 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేశారు.

 

సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. కాగా.. నిమ్మగడ్డకు వైసీపీ అధినేత,ఏపీ సీఎం  వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.