బాలికపై అత్యాచారం

 


నాదెండ్ల లో మైనర్ బాలికపై అత్యాచారం..


 పిల్లలను ఆడించెందుకు వచ్చిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రబుద్ధుడు...


 ఆ బాలిక ఇప్పుడు8 నెలల గర్భిణీ..


అమరావతి :
ఆయనకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


ఆ పిల్లలను ఆడించేందుకు ఇంటికి వచ్చిన 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గర్భిణిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. 


సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామంలో గ్రామంలో వెలుగుచూసింది.


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 


వీరి కుమార్తె ఏడో తరగతి తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేడు. 


సమీపంలో నివాసం ఉంటున్న బోడాల శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి పిల్లలను బాలిక ఆడిస్తూ ఉండేది.


 బాలికపై కన్నేసిన శ్రీనివాసరావు మాయ మాటలతో లోబరుచుకున్నాడు. 


ఈ విషయం  బాలిక ఇంట్లో వారికి తెలియడంతో పెద్దలు పంచాయతీ చేసి శ్రీనివాసరావు ను హెచ్చరించారు. 


తిరిగి సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో బాలిక గర్భిణీ అయింది. 


ప్రస్తుతం 8 నెలల గర్భిణి కావడంతో పెళ్ళి చేసుకోవాలని కోరింది. 


ఈ విషయమై ఆదివారం రెండు కుటుంబాల మధ్య చెలరేగింది.


 దీంతో బాధితురాలు వారి కుటుంబసభ్యుల తో కలిసి నాదెండ్ల పోలీసు స్టేషన్ లో సోమవారం పిర్యాదు చేసింది.


 పోలీసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు ఈ సంఘటన పై విచారించారు.