సీఎం జగన్ చెబుతున్న మాటలకు పొంతన లేదు .

 


 


పశ్చిమగోదావరి: సీఎం జగన్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో జగన్ ఒక్కసారి కూడా పర్యటించలేదన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న సమయంలో రెండు సార్లు పొత్తు పెట్టుకుని చంద్రబాబు తమ పార్టీని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు.  తాడేపల్లిలో గోవులు సామూహికంగా చనిపోవడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అవసరమైతే ఉద్యమం చేస్తామని కన్నా తెలిపారు. పంట మంపునకు గురైన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?