అయినవిల్లి వినాయకుని దర్శించుకున్న కో - ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా


అయినవిల్లి. వినాయకునిదర్శించిన కో-ఆపరేటివ్ బాంక్ చైర్మన్-చల్లా


(అమలాపురం -జి ఎన్ రావ్ )


ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజమహేంద్రవరం, ఆర్యాపురం కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్  శ్రీ చల్లా శంకర రావు గారు  గతములో శ్రీ స్వామి వారికి సమర్పించియున్న వెండి మకర తోరణం నకు  నూతనముగా సుమారు ఒక లక్ష రూపాయల వ్యయముతో మెరుగులు దిద్దించి తిరిగి కార్యనిర్వహణాధికారి వారికి అందజేసినారు. అర్చకులు సంప్రోక్షణ పూజాది కార్యక్రమములు నిర్వహించి శ్రీ స్వామి వారికి అలంకరణ చేసియున్నారు. అనంతరం శంకరరావు గారు దంపతులను శేష వస్త్రముతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు. మెరుగులు దిద్దిన మకర తోరణంతో మరింత ఆకర్షణతో నవరాత్రి ఉత్సవములలో భక్తులకు కనబడేటట్లు కార్యనిర్వహణాధికారి వారు ఏర్పాట్లు చేసినారు.


అయినవిల్లి లో. ప్రసిద్ధి గాంచిన శ్రీ సిద్ది వినాయక స్వామి వారిని. రాజమoడ్రి. ది ఆర్యా పురం. కో. ఆపరేటివ్ఆర్బన్ బాంక్ చైర్మన్. చల్లా శంకర్ రావ్. శనివారం. దర్శించి కున్నారు