మహాధర్నా నిర్వహిస్తున్న తెదేపా

 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచిపోయిన తెరాస అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు సోమవారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర బాధ్యుడు పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ తన అయోమయ నిర్ణయాలతో నగరాన్ని అధఃపాతాళానికి దించేశారని విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్లను రెండులక్షల వరకు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు స్పందించి ఐదులక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. పాతికవేల ఇళ్లను కూడా కట్టలేదన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి సతీష్‌కుమార్‌, నగర నాయకులు నల్లెల్ల కిషోర్‌, బిల్డర్‌ ప్రవీణ్‌, ముప్పిడి మధూకర్‌, బాలరాజ్‌గౌడ్‌, ఎం.కె.బోస్‌, రవీంద్రచారి, యాదగిరిరావు, కొమరన్న పాల్గొన్నారు.


 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి