పెళ్లి జరగాల్సినపుడు జరుగుతుంది

 


నాది ప్రేమ వివాహం కూడా కావొచ్చు..ప్రభాస్‌  
పెళ్లి జరగాల్సినప్పుడు జరుగుతుంది



హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన్ను పెళ్లి గురించి మీడియా ప్రశ్నించింది. ప్రభాస్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అని అడగగా.. 'డార్లింగ్‌' సమాధానం చెప్పారు. 'పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు' అని అన్నారు.


అనంతరం 'సాహో' కోసం రూ.100 కోట్లు పారితోషికంగా తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. 'ఈ సినిమా నిర్మాత నా స్నేహితుడు. కేవలం ఓ పోరాట ఘట్టం కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశాం. సినిమాలోని ఓ భాగం బడ్జెట్‌ నా పారితోషికం' అని ప్రభాస్‌ చెప్పారు.


'సాహో' సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రామోజీఫిల్మ్‌ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరగనుంది.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?