130 తెలుగు విద్యార్థులు క్షేమముగా ఉన్నారు


 


కశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అమర్ నాథ్ యాత్రికులతో పాటు, ఎన్ ఐటీ శ్రీనగర్ విద్యార్థులను కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో, తాము శ్రీనగర్ లో చిక్కుకుపోయాయని, తమను కాపాడాలంటూ ఎన్ ఐటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు సురక్షితంగా జమ్మూ చేరుకోవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

130 మంది తెలుగు విద్యార్థులు జమ్మూ చేరుకున్నారని, వారిని అక్కడి నుంచి రైలు ద్వారా సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ తీసుకువస్తామని ట్వీట్ చేశారు. ప్రభుత్వం టికెట్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. అంతకుముందు, తెలుగు విద్యార్థుల విషయం తెలియగానే, ఢిల్లీలో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఫోన్ నంబర్లు ట్విట్టర్ లో ఉంచారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి సాయం కావాలన్నా ఆ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి