హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి

 



హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి పరుగు తీయగా, కార్తీక్ అనే స్థానికుడు వెంబడించి పట్టుకున్నట్టు తెలిసింది. కారు ప్రమాద దృశ్యాలను తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన కార్తీక్, హీరో రాజ్ తరుణ్ ను వెంబడించాడు. అయితే, రాజ్ తరుణ్ తాను మద్యం సేవించి ఉన్నానని, వదిలిపెట్టాలంటూ కోరడం వీడియో ద్వారా వెల్లడైంది. ఇప్పుడా వీడియోలు ఇచ్చేయాలంటూ తనతో బేరాలకు దిగి, ఆపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్థానికుడు కార్తీక్ మీడియాను ఆశ్రయించాడు.

వీడియోలు ఇచ్చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని, తాను నిరాకరించడంతో బెదిరింపులకు దిగారని కార్తీక్ ఆరోపించాడు. వీడియోల విషయంలో కార్తీక్ ను ఫోన్ ద్వారా సంప్రదించినవారిలో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, మరో మహిళ ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్ శివారు నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి