జాతీయ బాలల హక్కుల కమిషన్ పర్యటన

08-08-2019 గురువారం ఉదయం 9 గంటలు నుండి 4 గంటలు వరకు మన  జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఢిల్లీ)సభ్యులు Dr. ఆనంద్ గారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గ్రీవెన్సు నిర్వహిస్తున్నారు. కావున మన NGO లు మీ మీ ఏరియాలలో  వయసు  1 to 18 years పిల్లలు హక్కులు భంగం కలిగితే అనగా వాళ్లు చదివే ప్రయివేటు, ప్రభుత్వ ఫాఠశాల లు లో మౌలిక సదుపాయాలు లేకపోయినా, ప్రైవేటు స్కూల్లో అధికఫీజులు వసులుచేస్తున్న, బాలకార్మికలుగా ఎవరైనా పనిలో పెట్టుకున్న, లైoగిక వేదింపులు జరిగినా, ఇంటర్ కాలేజ్ ల లో సర్టిఫికెట్ లు ఇవ్వకుండా ప్రైవేటు యజమాన్యాలు ఇబ్బంది కు గురిచేసిన, అధిక పీజులు వసూలు చేసిన,ఆటస్థలం లేకపోయినా ,విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచెయ్యకపోయిన, బీసీ, sc, st, హస్టెల్స్ లో సదుపాయాలు సరిగా లేకపోయినా , వికలాంగుల పిల్లలు కు పెన్షన్ ఇవ్వకపోయినా, మధ్యాహ్న భోజనం బాగోలేకపోయిన, ఇలా పిల్లలు సంబంధించిన అన్ని సమస్యలపై పిర్యాదు 
చేసుకోవచ్చు. వెంటనే పరిష్కరించబడుతుంది కావున మన విజయనగరం జిల్లా ప్రజలు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.