అర్చ కుడు ఓ అమ్మాయిపై కన్నేశాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడు.

విజయవాడ: ఆలయానికి వచ్చిన భక్తులకు శఠగోపం పెట్టి, తీర్థప్రసాదాలు ఇవ్వాల్సిన అర్చ కుడు ఓ అమ్మాయిపై కన్నేశాడు.  పూజల ముసుగులో అమ్మాయిని గది లోకి తీసుకెళ్లి  అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడం తో మహిళలంతా కలిసి పూజారికి అదే ఆలయం లో బడితపూజ చేశారు. నగరంలోని ప్రకాష్‌ నగర్‌ లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాష్‌ నగర్‌లోని హరిహర క్షేత్రానికి పక్కన ఓ దేవాలయం ఉంది.  ఇద్దరు అక్కా చెల్లెళ్లు గత శుక్రవారం ఈ ఆలయానికి వెళ్లి హోమ గుండం వద్ద కూర్చున్నారు. కాసేపటికి ఆలయ అ ర్చకుడు వారి వద్దకు వెళ్లాడు. మంత్రోపదేశం చేస్తా నని చెప్పి చెల్లిని ఆలయం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె నుదుటన బొట్టు పెట్టి, నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఆమె పట్ల అస భ్యకరంగా ప్రవర్తించాడు. పూజారి వెంట వెళ్లిన చెల్లి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్క వెళ్లి గది తలుపు తీసింది. ఇంతలో పూజారి చేస్తున్న అకృత్యం ఆమెకు కనపడింది. అక్కడి నుంచి వెంటనే చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసింది. ఆలయంలో జరిగిన విషయం ఆదివా రం ఉదయం తల్లిదండ్రులకు తెలిసింది. వారితో పాటు చుట్టుపక్కల వారు వెళ్లి ఆలయంలో పూ జారికి భక్తుల సమక్షంలోనే బడిత పూజ చేశారు.