కీచకులను కఠినంగా శిక్షించటం...Gvss రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ నాయక్ డిమాండ్..

కీచకులను కఠినంగా శిక్షించటం...Gvss రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ నాయక్ డిమాండ్.. కంబదూరు మండలం తిమ్మాపురం బాలయోగి గురుకులం రెసిడెన్షియల్ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న అభంశుభం తెలియని బాలికపై పాఠశాలలో పనిచేసే సిబ్బంది తమ లైంగిక వాంఛ తీర్చుకోవడం చాలా బాధాకరమని అటువంటి నిందితుడిని వెంటనే శిక్షించాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర (Gvss) అధ్యక్షుడు శివ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో చాలా మంది రైతులు తమ విద్యార్థుల నువ్వు చదివించు కోలేక వలస వెళ్లి వారి పిల్లల్ని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో మంచి చదువులు చదివి ఇద్దామని చేర్పిస్తే అక్కడ పనిచేసే సిబ్బంది అభం శుభం తెలియని బాలికల పట్ల చెడుగా ప్రవర్తించకండి వారికి మాయమాటలు చెప్పి లోబర్చుకోవడం చాలా బాధాకరమైన విషయం అని బాలికల వసతిగృహాల్లో పనిచేసే సిబ్బంది మహిళలే ఉండాలి గాని వయసులో ఉన్న యువకులు సిబ్బంది గా నియమించడం వెనుక అర్థం ఏమిటని వారిని నియమించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ కూడా వెంటనే అరెస్టు చేయాలని అలాగే రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గురుకులం పాఠశాలల్లో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటువంటి ప్రిన్సిపాల్ ను తక్షణం సస్పెండ్ చేసి అమాయక బాలిక పట్ల లైంగిక వాంఛ తీర్చుకున్న సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు