పేదలకు వృద్ధులకు పండ్లు,వస్త్రాధానం


పేదలకు వృద్ధులకు పండ్లు,వస్త్రాధానం*
అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో గణపతి వర్తక సంఘం పందిరిలో  శ్రీ సిద్ధి వినాయక పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.తిరుమనాధం గంగరాజు,అంజిబాబు ఆర్ధిక సహాయంతో 500 మంది పేదలకు, వృద్ధులకు, పండ్లు,వస్త్రధానం, చేసారు. ఈ కార్యక్రమంలో  కమిటీ మెంబర్స్ నిమ్మన వైకుంఠం, పురుషోత్తం భద్రం, గుండుమొగుల పెద్దకాపు, తిరుమనాధం గంగరాజు, కల్వకొలను రాజా నల్ల సత్యనారాయణ తదితర వ్యాపారస్తులు పాల్గొన్నారు.