విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పళ్ళు పంపిణి


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 



విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాల లో గర్భిణీ స్త్రీలకు పళ్లను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రవేశ పెట్టబడిన “పోషణ  అభియాన్” అను పథకం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పోషక ఆహరం మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడం జరిగింది .కార్యక్రమంలో   NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా''ఆర్ .ప్రభాకర్ గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. ముఖ్యంగా ఆహరం లో పాలు, గుడ్లు, పండ్లు మరియు ఎక్కువ శాతం పోషకాలు కలిగిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని కోరారు . అదే మేరకు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయయానంద కుమార్ గారు మాట్లాడుతూ , ఇలాంటి కార్యక్రమాలు జాతీయ సేవా పథకం క్రింద NSS వాలంటీర్లు మరియు NSS సిబ్బంది కలిసి అవగాహనా సదస్సులు చేయడం చాల ఆనంద దాయకం అని, అదే విధంగా గర్భిణీ స్త్రీలకు పండ్లును పంపిణి చేశారు. “ఆరోగ్యమేమహాభాగ్యం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధి అధికారి డాక్టర్. జి .  శంక ర య్య గారు, సమన్వయకర్త డా ''ఉదయ్ శంకర్ అల్లం గారు, విశ్వవిద్యాలయ పి . ఆర్ . ఓ డా " నీలమణి కంఠ గారు ,అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయకర్త డా "క్రిరణ్మయీ గారు  మరియు వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు .