యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

అమరావతి: దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని సీఎం ఆదేశం
నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని సీఎం ఆదేశం
ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న  మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం 
బోటు ప్రమాద ఘటనలపై సీఎం సీరియస్‌
తీవ్రంగా పరిగణిస్తామన్న సీఎం
ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశం
తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా? అన్నదానిపై క్షణ్నంగా తనిఖీచేయాలన్న ముఖ్యమంత్రి
లైసెన్స్‌లు పరిశీలించాలని , బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా తనిఖీచేయాలని సీఎం ఆదేశం
ముందస్తు జాగ్రత్తలు బోట్లలో ఉన్నాయా? లేదా? పరిశీలించాలన్న సీఎం
నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి తనకు నివేదించాలన్న సీఎం