భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో వైసీపీ చెలగాటం--ఇసుక కృత్రిమ కొరతతో అవస్థలు


భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో వైసీపీ చెలగాటం--ఇసుక కృత్రిమ కొరతతో అవస్థలు


చేష్టలుడిగి చూస్తున్న జగన్‌ సర్కారు: చంద్రబాబు నాయుడు


అత్యుత్తమ ఇసుక పాలసీని అందిస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. అత్యంత చెత్త పాలసీని రూపొందించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో రూ.3000 వెచ్చిస్తే లారీ ఇసుక ఇంటి వద్దకు వచ్చేదని.. కానీ ప్రస్తుతం రూ.30,000 నుంచి లక్ష రూపాయలు చెల్లించినా దక్కే పరిస్థితి లేదన్నారు. సమూల మార్పులంటూ హడావుడి చేసిన వైసీపీ ప్రభుత్వం తమ చేతగాని తనంతో.. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజను పస్తులు పెడుతోందన్నారు. కృత్రిమ ఇసుక కొరతతో 33 రకాల వృత్తులకు చెందిన 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఏదైనా వ్యవస్థను ప్రక్షాళన చేసినా, నవీకరించినా పని సులువు కావాలి. ధరలు అందుబాటులోకి రావాలి. కానీ ప్రభుత్వ చేతగానితనంతో ఇసుక తరలింపు కష్టంగా మారడంతో పాటు.. సామాన్యుడికి అందని స్థాయికి ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజల బాధల్ని తీర్చాల్సిన ప్రభుత్వం.. ప్రజలను మరిన్ని కష్టాలకు గురి చేయడం దుర్మార్గమన్నారు.


చంద్రబాబు ముందు గోడు వెల్లబోసుకు న్నారు