గుంటూరు జిల్లా తెనాలి అంతర్జాతీయ దొంగల అరెస్ట్ 

 


గుంటూరు జిల్లా తెనాలి అంతర్జాతీయ దొంగల అరెస్ట్ 


తెనాలి పట్టణం నందు మోటార్ సైకిళ్ళు స్కూటర్లు పై వెళ్లే వారిని వెంబడించి వాళ్ల దగ్గర డబ్బులు లేదా బంగారు వస్తువులు ఉన్నాయి అని నిర్ధారించుకుని వాళ్ళ వెనక కొంత దూరం వెళ్లి వాళ్ళ మోటార్ సైకిల్ యొక్క బోల్టులు ఊడిపోయాయి అని చెప్పి బండి ఆపి వారిని  అయోమయానికి గురి చేసి వారి వద్ద ఉన్న డబ్బులు బంగారాన్ని దొంగతనం చేస్తూ ఉంటా రని తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మోటార్ సైకిల్ పై వెళుతున్న ఫిర్యాది బట్టు పాపారావు  s/o ప్రభాకర్ రావు చినరావూరు తోట తెనాలి పట్టణం వానిని బోల్టులు ఊడిపోయాయి అని చెప్పి అతని అయోమయానికి గురి చేసి అతని షర్ట్ జేబులో ఉన్న బంగారు వస్తువులను  డబ్బు దొంగతనం చేసినారు ఈ కేసు విషయమై తెనాలి ఎస్ డి పి ఓ  పర్యవేక్షణలో తెనాలి వన్టౌన్ సిఐ ఎన్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు లో ముద్దాయిలును సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది అన్నారు వారి వద్ద నుంచి 43. 50 గ్రాముల బంగారం 80 వేలు డబ్బులు రికవరీ చేసినట్టుగా డిఎస్పి తెలియజేశారు ముద్దాయి అయిన  1.దొర పల్లి కమలాకర్  (41) వైయస్సార్ కాలనీ 2.జక్కంపూడి విజయవాడ గరిక శ్రీను ను సన్నాఫ్ ఆంజనేయులు (35) గా గుర్తించి పట్టుకున్నట్లుగా తెనాలి డిఎస్పి శ్రీలక్ష్మి తెలియజేశారు అదేవిధంగా వన్ టౌన్ టౌన్ సిఐ రాజేష్ ఎస్సై అనిల్ కుమార్ నీ మరియు వారి సిబ్బందిని అభినందించారు