విద్యుత్ సంస్కరణలు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం

విద్యుత్ సంస్కరణలు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, విద్యుత్ సరఫరా నష్టాలు... తదితర విషయాలపై జాతీయస్థాయిలో సమావేశాలు జరిగినప్పుడు... గతంలో కేంద్ర మంత్రులు ఏపీలో చంద్రబాబుగారు ఉత్తమ విధానాలను అమలుచేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు ఆ విధానాలను అనుసరించాలని చెప్పేవారు. మరి నిన్నటి శుక్రవారం కూడా ఇలాంటి ఒక సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర విద్యుత్ శాఖామంత్రి ఆర్.కె. సింగ్. ఆ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. కానీ అది ప్రశంస కాదు. ఒక విధంగా చెప్పాలంటే చివాట్లు పెట్టినట్టు. ఏపీలో  పీపీఏల పై జగన్ గారు చేస్తున్నట్టు చేస్తే ఏ పెట్టుబడిదారుడైనా ఎందుకు వస్తాడు? అని అడిగారు. ఈ రకంగా జగన్ గారి తుగ్లక్ చర్యల మూలంగా ఏపీ జాతీయ స్థాయిలో దిగజారుతోంది.