హుజూర్ నగర్* ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా *చావా కిరణ్మయి* గెలిపించండి


 *హుజూర్ నగర్* ఉపఎన్నిక
ఎమ్మెల్యే అభ్యర్థిగా *చావా కిరణ్మయి* గెలిపించండి : *పంచాయతీరాజ్ ఛాంబర్* జాతీయ అధ్యక్షుడు *ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్* పిలుపు.

 *తెలంగాణ* రాష్ట్రంలోని *ఉపఎన్నిక* సందర్భంగా *హుజూర్ నగర్* వెళ్ళిన *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
 *ఎంపిటిసిల సంఘం* రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఉండగా,
 *నల్గొండజిల్లాకు* చెందిన
 చెందిన *కిరణ్మయి* గారు *రాష్ట్రకార్యదర్శిగా* ఎంతో కష్టపడి *ఉద్యమాలలో* పనిచేసి, అనేక *పోరాటాలలో* 
పాల్గొన్నారు.
ప్రస్తుతం తెలంగాణా
 *పంచాయతీరాజ్ ఛాంబర్* కార్యదర్శిగా *పంచాయతీరాజ్ స్థానిక ప్రభుత్వాల* , 
హక్కులు అధికారాల కోసం, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.



 *తెలంగాణ* ప్రభుత్వం, గ్రామాల
 అభివృద్ధిలో, సర్పంచుల పట్ల *పక్షపాత వైఖరి* ని చూపిస్తోంది.
  సర్పంచ్ ఉపసర్పంచ్  లకు కలిపి *జాయింట్ చెక్ పవర్* పెట్టడం ద్వారా   రాజకీయ, వ్యక్తిగత *వైరుధ్యాల ను*  సృష్టిస్తోంది.
దీని వలన గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోంది.
ఈ రకంగా తెరాస ప్రభుత్వానికి హుజూర్ నగర్ ఉపఎన్నికలో *స్థానిక సంస్థల* పోరాట నాయకురాలు కిరణ్మయినీ గెలిపించాలని, *హుజూర్ నగర్*   నియోజకవర్గంలోని అన్ని గ్రామాల
 సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలు రాజకీయాలకు అతీతంగా కిరణ్మయి గారి విజయానికి కృషి చేయాలని *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు పిలుపునిచ్చినారు.
పిదప *రాజేంద్రప్రసాద్* గారు హుజూర్ నగర్ పట్టణం లో *కిరణ్మయి* గారికి మద్దతుగా *ఎన్నికల ప్రచారం* నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, 
 ఇతర సర్పంచులు, మొదలగు స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.