రైతులకు కొండంత భరోసా ఎ.పి ప్రభుత్వం_ఎమ్మెల్యే సింహాద్రి..

*రైతులకు కొండంత భరోసా ఎ.పి ప్రభుత్వం_ఎమ్మెల్యే సింహాద్రి..*


*ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను అమలు చేయడం ద్వారా దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోంది ఎమ్మెల్యే సింహాద్రి....*



*అవనిగడ్డ ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు..ఈ సందర్భంగా ముందుగా సభాస్థలి లో ఏర్పాటు చేసిన వివిధ  శాఖలకు లకు సంబంధించిన స్టాల్స్ ను సందర్శించి సభలో పాల్గొని మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం రైతు భరోసా పథకం కు 27,466 మంది అర్హులు కాగా 23,265 మందికి ప్రస్తుత 18,37,31,500రూ మంజూరు చేశారు అని అన్నారు అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు...* ఈ కార్యక్రమంలో వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు,మచిలీపట్నం ఆర్ డి ఓ గారు,ప్రభుత్వ అధికారులు,వైసీపీ నాయకులు కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.