టైం ఇవ్వండి స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా - సీఎం జగన్
ప్రభుత్వానికి మూడు సంవత్సరాల టైం ఇవ్వండి.. అప్పటిలోగా.. ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితిని మార్చివేస్తానన్నారు సీఎం జగన్. దశల వారీగా వీటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి..ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామన్నారు. కరపలో సచివాలయ ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు..
గ్రామాల్లో ఉన్న ప్రతి స్కూల్కు సంబంధించిన ఫొటోలను తీసుకరావాలని చెప్పడం జరిగిందని..స్కూళ్లల్లో ఉన్న పరిస్థితిని మార్చివేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు క్రియాశీలక పాత్రలు పోషిస్తాయన్నారు.
*🔹ప్రస్తుతం ఏపీలో 44 వేలకు పైగా పాఠశాలలున్నాయని, ప్రతి సంవత్సరానికి 15 వేలకు సంబంధించిన స్కూళ్ల ఫొటోలను తీసి సచివాలయ బోర్డులో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే..అభివృద్ధి చేసిన అనంతరం నాడు..నేడు అంటూ ఫొటోలను డిస్ ప్లే చేస్తామన్నారు.