రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ఉదార . చిన్నారులు, మహిళలకు సాంఘిక దురాచారాల నుంచి విముక్తి కల్పిస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు చేయూతనందించారు. ఈ సంస్థకు చెందిన వాహనం రెండువారాల క్రితం చెడిపోయిందని.. దాతలు సాయంచేయాలని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్పెట్టారు. అనుషారెడ్డి అనే నెటిజెన్ దీనిని స్క్రీన్షాట్ తీసి మంత్రి కేటీఆర్కు ట్వీట్చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మంగళవారం తన కార్యాలయంలో సునీత కోరినట్టుగా వాహనం కొనుగోలుకు అవసరమైన సొమ్మును చెక్ రూపంలో అందించారు.
ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు