ఏసీబీ అధికారులపై డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్.

అమరావతి:


ఏసీబీ అధికారులపై డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్.


*పిల్లి సుభాష్ చంద్రబోస్, డెప్యూటీ సీఎం.*


*కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారు.*


అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణం.


*ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.*


ఏసీబీ డీజీతోనూ.. హోం మంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడాను.


*ఈ కేసు విషయంలో విచారణే అవసరం లేదు..  పూర్తి సాక్ష్యాధారాలున్నాయి.*


తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారుల మీదా అలాగే కేసులు పెట్టాలి.


*తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి.. సస్పెండ్ చేయాలి.*


లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..?


*ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. మా శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.*


విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నాం.