అత్యాచారం కి గురి అయి చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన టీడీపీ నేతలు

*గుంటూరు జిల్లా*


*నరసరావుపేట ఏరియా వైద్యశాలలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో హత్యాచారం కి గురి అయి చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన టీడీపీ నేతలు .....*


*నన్నపనేని రాజకుమారి,మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నజీర్,చదలవాడ అరవింద బాబు.....*


నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.
వైసీపీ నేతలు నింతుడుడిని కాపాడుతున్నారని పోలీసులు కేసును పక్కదారి పట్టించేలా వ్యవరిస్తున్నారని 
గత ప్రభుత్వం లో ఇలాంటి ఘటన దాచేపల్లి లో జరిగినప్పుడు.తెలుగుదేశం ప్రభుత్వం 24 గంటల్లోనే 18 పోలీస్ బృందాలను వేసామని ,బాలిక తల్లిదండ్రులకి 10 లక్షల రూపాయల ఎక్గ్రెసియా ఇచ్చి
బాధితులని అన్ని విధాలుగా ఆదుకున్నాము అన్నారు.


పసిపిల్లల పై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.నియోజకవర్గ ఇంచార్జ్ డాllచదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఈ సంఘటన బాధాకరమన్నారు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. కేసును నీరుకార్చేఅందుకు ప్రయత్నిం చడం దారుణమన్నారు. నిందితుడిని కాపాడేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించడం శోచనీయమన్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలన్నారు.