కేసీఆర్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు  విమర్శలు

కేసీఆర్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. ఇప్పుడున్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వం చేసిన హత్యేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో ఒక్క కార్మికుడిని కూడా కేసీఆర్ నియమించలేదని, కానీ ఉన్న ఉద్యోగులు.. 48వేల మందిని తొలగిస్తున్నట్లు చెప్పడం చాలా దురదృష్టకరమని, సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రావడానికి ఆర్టీసీ, ఉద్యోగులు ముఖ్య కారకులని.. ఇప్పుడు వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని అన్నారు. వెంటనే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?