శ్రీ షిరిడి సాయి బాబా మందిరం వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన


విజయవాడ  ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో సంకల్పించినటువంటి వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన కలుగుతున్నది. ఈ వెండి తాపడమునకు కె.వెంకట రమణారావు గారు ఒక కేజీ 250 గ్రాములు వెండిని సమర్పించినారు. దాత మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు సామాజిక సేవా కార్యక్రమములు చూసి ఎంతో ఆనందం కలిగినది, అందుచేతనే మందిరం వారు నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినారు అందులో భాగంగా అత్యంత అద్భుతంగా షిరిడీ లో ఉన్న మాదిరిగానే మందిరంలో మూడు వైపులా కూడా వెండి తాపడం పనులకు నా వంతుగా సహాయాన్ని అందజేసినాము అని తెలియజేసినారు.


         మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ మందిరంలో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తుల సహాయ సహకారాలు మరువలేనివి వారికి ఎన్నడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము అని తెలిపినారు.
            ఈ మందిరం లో ఉండే విశేష శక్తి వల్ల బాబా వారిని భక్తులు ప్రతిరోజూ దర్శనం చేసుకొని వారు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏ కార్యక్రమానికైనా భక్తులు విరివిగా వారి యొక్క సహాయ సహకారాలు అందజేయడం వల్ల ఎటువంటి పెద్ద కార్యక్రమమైన కూడా మాకు శ్రమ లేకుండానే బాబా వారి అనుగ్రహముతో  దిగ్విజయముగా పూర్తి అగుచున్నది అని మందిర గౌరవాధ్యక్షులు తెలియజేసినారు.
           కావున భక్తులందరూ కూడా మీ శక్తి కొలది కొత్త వెండి లేదా మీ ఇంట్లో వాడే పాత వెండి వస్తువులు అయినా సరే సమర్పించి శాశ్వతంగా ఉండేటటువంటి  రజక తాపడం లో మీరు కూడా భాగస్వాములు కావలసినదిగా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి. గౌతమ్ రెడ్డి గారు తెలియజేసినారు.
     ఈ కార్యక్రమములో మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి గారు,  ప్రధాన కార్యదర్శి పి. మల్లయ్య 


మరియు మందిర సభ్యులు పాల్గొన్నారు.