రాష్ట్ర ప్రజలకు కేటీఆర్‌ దసరా శుభాకాంక్షలు


రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను చేకూర్చే విజయ దశమి పర్వదినాన ప్రజలంతా ఆనందంగా ఉండాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలనీ, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.