వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

 


వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు


*కృష్ణానది తీర గ్రామాలైన ఇబ్రహీంపట్నం మండలం దాములూరు,మూలపాడుకోటికలపూడి గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు పర్యటించారు గ్రామస్థులతో మాట్లాడారు. వరద ముంపుకు గురైన  పంట పోలాలను పరిశీలించారు.  రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.  ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తక్షణమే  అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరద ముంపుకు గురైన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు కు అవసరమైన విత్తనాలు అందించేందుకు వ్వవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు*


*ఈ కార్యక్రమంలో పై గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు*