ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 10వ తేదీ నుంచి ఆఫ్రికా పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 10వ తేదీ నుంచి ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. 11న కామరోస్‌ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమనితో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12, 13, 14 తేదీల్లో సియోర్రాలియోన్‌లో పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు జూలియస్‌ మాదా బయో, విదేశాంగ మంత్రి నబీలా ఫరీదా ట్యూనిస్‌తో వేర్వేరుగా సమావేశమవుతారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. సియోర్రాలియోన్‌లో భారత సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి సమావేశమవుతా