ఆర్టీసీ కార్మికుల సమస్యలు సీఎంకు పట్టదా

ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు సీఎంకు పట్టవని.. తన ఆస్తుల రెగ్యులరైజేషన్‌పైనే కేసీఆర్ దృష్టి ఉందని విమర్శించారు. ఆర్టీసీని కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని ఎంపీ పేర్కొన్నారు.