హైదరాబాద్ సైంటిస్ట్ హత్య

 


హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన ఎన్ఆర్ఎస్ఏ సైంటిస్టు హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. శాస్త్రవేత్త సురేశ్ కుమార్ (56) నిన్న తన ఫ్లాట్‌లోనే హత్యకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం సురేశ్ కుమార్ మృతదేహాన్ని బంధువులు చెన్నైకి తరలించారు. సురేశ్ కుమార్ తలపై బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యుల ప్రాథమిక నివేదికను బట్టి తెలుస్తోంది. మృతదేహంపై లభించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ హత్యకు స్వలింగ సంపర్కం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, సురేశ్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు శాస్త్రవేత్తను శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.