బీజేపీ ప్రభుత్వం విదేశాల్లోని భారతీయుల ధనం

విదేశాల్లోని నల్లధనం తెప్పిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో స్విస్ బ్యాంకుల్లో ధనం దాచుకున్న భారతీయుల ఖాతాల ఫస్ట్ లిస్ట్ భారత్‌కు చేరుకున్నాయి.దీంతో ప్రధాని మోడీ హామీకి మరో అడుగు పడింది.
బీజేపీ ప్రభుత్వం విదేశాల్లోని భారతీయుల ధనం గురించి ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తోంది.  తాజాగా ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) విధానం కింద స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల తొలి జాబితా వెలుగు చూసింది. ఈ వివరాలను అందించినట్లు స్విట్జర్లాండుకు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌కు (FTA) చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.