ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారికు టీల

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఈ కోటాలోనూ 50 శాతం మహిళలకే కేటాయించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విధివిధానాలపై సమీక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర స్థాయిలో జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల్లో వివిధ స్థాయిల్లో విభాగాలుండాలని సూచించారు.