మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం...

మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం...
* న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం  
ఇంద్ర‌కీలాద్రి: శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట భుజాల‌తో దుష్టుడైన మ‌హిషాసురుడిని అమ్మ‌వారు సంహ‌రించింది ఈ రూపంలోనే. అందుకే న‌వ‌దుర్గ‌ల్లో అత్యుగ్ర‌రూపం. ఈ రోజున జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిష్టించి ఆయుధాల‌ను ధ‌రించిన మ‌హాశ‌క్తిగా భ‌క్తుల‌ను సాక్షాత్కరిస్తారు.. ఈ త‌ల్లికి గారెలు, బెల్లంతో క‌లిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.