ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటనకు తమిళనాడులోని మహాబలిపురం ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 3 రోజులపాటు ఇద్దరు నేతలు వివిధ అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల నుంచి మహాబలిపురం సముద్ర తీరంలోని కడైకరై ఆలయం, ఐదు రథాల ఆలయాలు, అక్కడి శిల్ప సంపదను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చెన్నై నుంచి మహాబలిపురం వరకు రహదారిని అందంగా ముస్తాబు చేశారు. ఈ మార్గంతోపాటు మహాబలిపురాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.