సీఎం జగన్ గారు యానిమేటర్ల జీవితాల్లో వెలుగులు నింపారు.

సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన 30మంది సంఘ మిత్రలు.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. *"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి చిరు ఉద్యోగికి మేలు జరిగేలా  కృషి చేస్తుంది. రూ.2 వేలు ఉన్న జీతాన్ని రూ.10 వేలకు పెంచి సీఎం జగన్ గారు యానిమేటర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే జీఓ లో పొందుపరిచిన..యానిమేటర్లకు విద్యార్హత, వయస్సు పరిమితి, ఉద్యోగ కాలం వంటి కొన్ని అంశాలను సడలించాలని ...ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని" శ్రీ కృష్ణ దేవరాయలు  గారిని  కోరారు*. ఎంపీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.