నిషేదిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు

     పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి నెల్లూరుకు నిషేదిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50లక్షలు విలువజేసే గుట్కా ఉత్పత్తులను, ఓ వాహనాన్ని సీజ్ చేశారు. నెల్లూరు చంద్రబాబు నగర్ కు చెందిన షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి తమిళనాడుకు వెళ్లి గుట్కాలను కొనుగోలు చేశాడు. 50 వేలు విలువజేసే గుట్కాలను కొనుగోలు చేసి మారుతీ సుజుకి ట్రక్ ద్వారా తమిళనాడుకు చెందిన సింబని బక్కన్ అనే వ్యక్తితో కలిసి నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.