విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
రాజవొమ్మంగి, నవంబర్ 9: స్థానిక మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పి ఎం సి చైర్మన్ వి. ఉదయభాను, వైస్ చైర్మన్ ఎం లలిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భాను మాట్లాడుతూ పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా కులమత బేధాలు లేకుండా అందరూ సమానమేనని భావన కలుగుతుందన్నారు. దానిద్వారా కులమతాలకతీతంగా కలిసిమెలిసి ఉండాలని ప్రభుత్వ విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులను ఏర్పాటు చేసిందన్నారు. తొలుతగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దొరబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మాజీ సర్పంచ్ సిహెచ్ అప్పారావు, మాజీ ఎస్ఎంసి చైర్మన్ శివ కుమార్, జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ గౌరీ శంకర్, ఎస్ఎంసి సభ్యులు, ఉపాధ్యాయులు బి. శ్రీనుబాబు, కె విగ్నేశ్వర రావు, ఏ కనకదుర్గ, గంగాభవాని, ఎం వెంకటరమణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు వి. అప్పారావు లు పాల్గొన్నారు.


Popular posts