విద్యార్థులే దేశ భవిశ్యత్

కలకత్తాలో  జరుగు “ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ - 2019” లో పాల్గొనుటకు  గౌరవ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్నాయుడు గారి ప్రోద్బలంతో ఎంపిక కాబడిన కొల్లివలస బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఎం. పి గారిని ఈరోజు  సాయంత్రం 07 గం. లకు కలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ ఎం. పి గారు విద్యార్థులే దేశ భవిశ్యత్ అని వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడంలో ప్రతిఒక్కరు ముందుండి భాద్యతగా వుండాలని ఆకాంక్షించారు.