మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి’

'మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి'


*రాజధానిని మార్చొద్దంటూ రోడ్డుపై బైటాయించిన దేవినేని ఉమ*


*సీబిఐ విచారణ చేస్తే అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏమిటో బట్టబయలౌతుంది*


*ప్రభుత్వం తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌*


*రాజధానిని పరిరక్షించాలంటూ నినాదాలు* 



_విజయవాడ రూరల్ (గొల్లపూడి) :- ఏపీ రాజధాని గ్రామాల్లో ఆందోళన ఉద్ధృతమైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగాపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. నేడు రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. 'మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి' అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అరెస్ట్ చేసి, భవానీపురం స్టేషన్ కు తరలించారు._