హైదరాబాద్‌లో కరోనా వైరస్‌    వ్యాధి నిర్ధారణ పరీక్షలు,

 కరోనా వైరస్‌    వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కరోనా వ్యాధి అనుమానితుల శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని పూణెకు పంపడం.. అక్కడనుంచి నివేదికలు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నది. దీంతో అన్ని వసతులు ఉన్న గాంధీ దవాఖానలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గాంధీలో ఉన్న వసతులు, యంత్ర పరికరాలు వంటి సమాచారంతో వైద్య, ఆరోగ్యశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.