మహిళామణులకు విజ్ఞప్తి 

        
మహిళామణులకు విజ్ఞప్తి 


అమరావతి పరిరక్షణ సమితి (JAC) పిలుపు మేరకు ది 10-1-2020 న, మధ్యాహ్నం 3 గంటలకు, బెంజ్ సర్కిల్, వేదిక ఫంక్షన్ హాల్ నుండి, రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా జరిగే ప్రదర్శన కు వువ్వెత్తున తరలి రండి.


ఒక్కసారని చాన్స్ ఇచ్చిన కృష్ణా, గుంటూర్ జిల్లాల వారిపై కనీస కృతజ్ఞత లేకుండా, 13 జిల్లాల మధ్యన వున్న పచ్చటి అమరావతిని స్మశానం చేయాలనుకుంటున్న జగనన్నకు బుద్ది చెబుదాం. 
రండమ్మా...రండి...కదలి రండి. 


అమరావతి కాళ్ళ పారాణిని కళ్ళముందే కాల్చేస్తున్న కుసంస్కారికి కళ్ళు తెరిపిద్దాం. రండమ్మా...రండి...కదలి రండి. 


మన బిడ్డల భవిష్యత్ కు విపత్తుని తెస్తున్న ఈ బుద్దిహీన, దగాకోరు, వంచకులకు నిరసన తెలియచేద్దాం. రండమ్మా...రండి...కదలి రండి. 


అన్నపూర్ణ లాంటి ఆంధ్రమాతను, ఇంద్ర నగరం లాంటి అమరావతిని కాలరాస్తున్న దోపిడీ మూకల కోరలు పీకుదాం. 
రండమ్మా...రండి...కదలి రండి. 


రుద్రమదేవిలా, రాణీ ఝాన్సీ బాయిలా దూసుకురండి. మహిళా లోకమంతా కడలి తరంగాల్లా వచ్చి, కదం తొక్కుదాం. 
రండమ్మా...రండి...కదలి రండి. 


అమరావతిని కాపాడుకుందాం.