అవినీతికి పాల్పడుతూ జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు

అవినీతికి పాల్పడుతూ జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరంలోని జూబ్లిహిల్స్‌ సర్కిల్‌-18లో జగన్‌ అనే వ్యక్తి ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటికి సంబంధించిన ముటేషన్ కోసం లంచం డిమాండ్‌ చేసి రూ.75 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.