అపార్ట్ మెంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు

అపార్ట్ మెంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు:


21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా వ్యాపార సంస్థలన్నీ బంద్ అయ్యాయి. వీటితో పాటు వైన్ షాపులు కూడా బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే వీరి బలహీనతను ఆసరా చేసుకొని కొందరు అక్రమ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారానికి తెర లేపారు. తాజాగా నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్ లో ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ పక్కనే ఉన్న విద్యా విహార్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో దేవరకొండ అంజి రెడ్డి అనే వ్యక్తి తన ఫ్లాట్ లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ పట్టుబట్టాడు. అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. అక్కడ ఇంటి లోపల బాత్రూం లో మద్యం ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?